ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి హైదరాబాద్ వెళ్ళు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సులో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను భద్రాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఎస్పీ రోహిత్ రాజ్ వివరాలు వెల్లడించారు. బస్సులో ప్లాస్టిక్ ట్రైల మధ్య, డోర్ మాట్స్ మధ్య భాగాలను కత్తిరించి ఒకదానిపై ఒకటి అమర్చి మధ్య భాగంలో నాలుగు క్వింటాళ్ల గంజాయిని హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు.