సోదరులను చంపిన మావోలు
చర్ల సరిహద్దు బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టుల ఘాతుకానికి ఒడిగట్టారు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో చుత్వాయి గ్రామానికి చెందిన మడవి ఉంగ, మడవి జోగా అనే ఇద్దరు గిరిజన సోదరులను శనివారం హతమార్చారు. వీరిని అటవీ ప్రాంతంలోకి పిలిచి ప్రజాకోర్టు నిర్వహించి సోదరులకు మరణశిక్ష విధించారు.