రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన శనివారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు గమనించి గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.