ప్రమాదవశాత్తులో బావిలో పడి ఎద్దులు మృతి

55చూసినవారు
ప్రమాదవశాత్తు బావిలో పడి జత ఎద్దులు మృతి చెందిన ఘటన నేలకొండపల్లి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని శంకరగిరితండా పంచాయతీ పరిధి కట్టుకొమ్ముతండాకు చెందిన జర్పుల రెడ్యా ఐదెకరాల కౌలుకు తీసుకుని సాగు చేస్తూ ఇటీవల రూ. 1. 50 లక్షలు వెచ్చించి జత ఎద్దులు కొనుగోలు చేశాడు. పొలంలో అరక దుక్కి దున్ని ఇంటికి వస్తుండగా నీరు తాగేందుకు ఎద్దులు చెరువు వైపు వెళ్లాయి. అయితే, మార్గమధ్యలో ఉన్న బావిలో పడడంతో మృతి చెందాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్