కాలువ గండి మరమ్మత్తు పనులను పరిశీలించిన దయాకర్ రెడ్డి

60చూసినవారు
కాలువ గండి మరమ్మత్తు పనులను పరిశీలించిన దయాకర్ రెడ్డి
కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా పాలేరు ఎడమ కాలువకు భారీ గండి పడిన విషయం తెలిసిందే. కాగా అక్కడ జరుగుతున్న గండి మరమత్తు పనులను మంగళవారం మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇంఛార్జి తుంబురు దయాకర్ రెడ్డి పరిశీలించారు. మరమత్తు పనుల యొక్క వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్