నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కందాళ

83చూసినవారు
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కందాళ
మున్నేరు వరద ముంపుకు గురైన ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ లోని వరద బాధితులకు కందాళ ఫౌండేషన్, చిరాగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నిత్యావసర సరుకులు, దప్పట్లను పంపిణీ చేశారు. అత్యవసర సమయాల్లో బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, అధైర్య పడొద్దని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెల్లం వేణు, ఉన్నం బ్రమ్మయ్యా ఉన్నారు.

సంబంధిత పోస్ట్