తహశీల్దార్ కు వరద బాధితుల వినతి

62చూసినవారు
ఖమ్మం రూరల్ మండలం వాల్యాతండా గ్రామ వరద బాధితులు శుక్రవారం సీపీఐ ఎం ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ ను కలిసి వినతిపత్రం అందించారు. తమ గ్రామంలో మరికొంత వరద బాధితులకు రాష్ట్రప్రభుత్వ పరిహారం ఇంకా అందలేదని తహశీల్దార్ ను కోరారు. స్పందించిన తహశీల్దార్ అకౌంట్ నంబర్ తప్పు లేదా ఇతర కారణాల వల్ల బాధితులకు నగదు జమ కాలేదని అన్నారు. అర్హులైన వరద బాధితులందరికీ ఆర్థిక సాయం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్