పేద ప్రజల గుండెల్లో నిలిచిన నేత వైయస్సార్

78చూసినవారు
ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఎమ్మెల్యే మట్ట రాగమయి అన్నారు. సోమవారం సత్తుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలకు వైఎస్సాఆర్ ఆద్యుడని పేర్కోన్నారు.

సంబంధిత పోస్ట్