ప్రజలకు అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి సూచించారు. సోమవారం వేంసూర్ మండల కేంద్రంలోని ఎండీఓ, తహసిల్దార్ కార్యాలయాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఆఫీసుల్లో రికార్డ్స్ పరిశీలించి అధికారులతో మాట్లాడిన అనంతరం కార్యాలయాలకు వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.