సత్తుపల్లి: రైతులకు మోటర్లు అందించిన సింగరేణి సంస్థ

80చూసినవారు
సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామ పంచాయతీ సత్తెంపేట, బాసరం, కొమ్ముగూడెం గ్రామాల్లో ఐటీడీఏ అనుమతితో రైతులు బోర్లు వేసుకున్నారు. గతంలో మోటార్లు ఉండి ఇప్పుడు అవి మరమ్మతులకు గురై పనిచేయని పరిస్థితుల్లో ఉండగా, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ సహకారంతో సుమారు రూ. 75 లక్షలు విలువ చేసే 30 మోటార్లను రైతులకు అందించారు. ఈమేరకు శుక్రవారం వాటిని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్