రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
తల్లాడ మండలంలోని నూతనకల్-మల్సూర్ తండాలో మధ్య మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఎస్సై కొండల్ రావు తెలిపిన వివరాల ప్రకారం కల్లూరు మండలం శాంతినగర్ కు చెందిన తేళ్లూరి కృష్ణ(62) మిట్టపల్లి నుంచి కల్లూరు వైపు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈఘటనలో ఆటో నుంచి కింద పడిన కృష్ణపై నుంచి గుర్తుతెలియని వాహనం వెళ్లడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు.