ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరు సహకరించాలి

558చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరు సహకరించాలి
తల్లాడ మండలం కుర్నవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జై ఝాన్సీ రాణి అధ్యక్షత వహించిన ఒక కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా పూర్వ అధ్యక్షులు కూరపాటి రంగరాజు, కుర్నవల్లి గ్రామస్థులు శనివారం పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి, వాటిలో వనరులు సమకూర్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్