రక్తంతో 'గుమ్మడి' చిత్రపటం... అభిమానం చాటిన యువకుడు
ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య వీరాభిమాని తన రక్తంతో గుమ్మడి చిత్రపటం గీయించి ప్రేమ్ కట్టించాడు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన ఒంగూరు వెంకటేశ్ ప్రస్తుతం పీడీఎస్యు ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నాడు. తన రక్తంతో చిత్రపటం గీయించి ఆయన ఆదర్శాలను అందరికీ చాటిచెప్పాలని భావించినట్లు వెంకటేశ్ తెలిపాడు. ఈనెల 20న ఖమ్మంలో సభ నిర్వహించి చిత్రపటాన్ని అందజేస్తానని చెప్పాడు.