యూపీలోని ఘజియాబాద్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. గోవింద్పురిలో విద్యార్థి కునాల్ త్యాగిని పాఠశాల ముందు పట్టపగలు దుండగులు కిడ్నాప్ చేశారు. అతడిని కారులో నలుగురు వ్యక్తులు బందీగా ఉంచి దారుణంగా కొట్టారు. కొట్టవద్దని ఎంత వేడుకున్నా వదల్లేదు. విద్యార్థిని కొడుతూ వీడియో కూడా తీశారు. వారి నుంచి తప్పించుకున్న కునాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాత కక్షల కారణంగానే అతడిని తీవ్రంగా కొట్టారని పోలీసులు తెలిపారు.