సర్జరీ చేసి పొట్టలోనే దూది వదిలేశారు..!

84చూసినవారు
సర్జరీ చేసి పొట్టలోనే దూది వదిలేశారు..!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి కడుపునొప్పి కారణంగా లోహియానగర్‌లోని ఓ నర్సింగ్‌ హోమ్‌కు వెళ్లాడు. వైద్యుడు పిత్తాశయం సమస్య ఉందని, శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. దీంతో అతడికి సర్జరీ చేశారు. అయితే అతడి కడుపులో దూదిని మర్చిపోయి కుట్టేశారు. కొద్దిరోజుల తర్వాత అతడికి కడుపు నొప్పి రావడంతో స్కానింగ్ చేయగా, కడుపులో పత్తి ఉండటాన్ని గమనించారు. వెంటనే అతనికి ఆపరేషన్ చేసి పత్తిని తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్