ఈ జిల్లాల్లో పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు

72చూసినవారు
ఈ జిల్లాల్లో పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు
AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ వెల్ల‌డించింది. మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

సంబంధిత పోస్ట్