‘కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే.. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా, కూటమిలో కింగ్ మేకర్గా అవతరించిన నితీశ్ కుమార్ బీహార్కు ప్రత్యేక హోదా సాధించాలి’ అంటూ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. బీహార్ సీఎం నితీశ్కు ఇదొక మంచి అవకాశమని చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమికి అవసరమైన మెజారిటీ వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా మోదీ మ్యాజిక్ ముగిసిపోయిందని వివరించారు.