దేశాన్ని కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కొమురంభీం జిల్లా సీపీఎం ఏరియా కమిటీ కార్యదర్శి దినకర్ అన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను జిల్లా కేంద్రంలో మంగళవారం విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. బీజేపీ పార్టీతో రాజ్యాంగానికి ప్రమాదం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కృషి చేస్తామని తెలిపారు.