భారీ వర్షం రాకపోకల అంతరాయం

60చూసినవారు
వాంకిడి మండల వ్యాప్తంగా శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సరండి గ్రామ పంచాయతీ గ్రామంలోని పాదయంతి ఒర్రె వాగు బ్రిడ్జి ఉప్పొంగింది. దీంతో రహదారికి అనుసంధానం ఉన్న పలు గ్రామాల ప్రజలకు ప్రయాణ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ సరండి గ్రామంలోని పాదయంతి ఒర్రె వాగు బ్రిడ్జికి వంతెన నిర్మించాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్