కాగజ్నగర్లో పట్టణంలోని కాపువాడలో నివసిస్తున్న ఇటుకల వ్యాపారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరికి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నగదు, బంగారం దోచుకెల్లారు. ఆదివారం ఇంటికి వచ్చిన యజమానికి ఇంటికి వేసిన తాళం పగిలి ఉండాంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫింగర్ ప్రింట్స్ ను సేకరిస్తున్నారు.