చాందీపుర వైరస్‌.. మరో బాలిక మృతి

80చూసినవారు
చాందీపుర వైరస్‌.. మరో బాలిక మృతి
గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన చాందీపుర వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడి తాజాగా నాలుగేళ్ల బాలిక మృత్యువాత పడింది. బాలికకు వైరస్ సోకిందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV) ధ్రువీకరించింది. కాగా, ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 13కు చేరింది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తిలో జ్వరం, ఫ్లూ, మెదడువాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దోమలు, ఇతర కీటకాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది.

సంబంధిత పోస్ట్