కాగజ్నగర్ పట్టణంలోని పోచమ్మ బస్తిలో గల శని మందిరంలో ఈనెల 23 న(మంగళవారం) హనుమాన్ జన్మోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పండిత్ నంద్ కిశోర్ జోషి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుండి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, హారతి కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించ వలసిందిగా కోరారు.