ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చిహ్కా గ్రామ సమీపంలో ఓ ఐఈడీని పేల్చేశారు. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండంట్ తీవ్రంగా గాయపడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్ ఎన్నికల డ్యూటీలో ఉండగా ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. గాయపడ్డ జవాన్ను బైరామ్గర్హ్ ఆస్పత్రికి తరలించినట్లు బీజాపూర్ పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు అప్రమత్తమై ఆ ఏరియాలో కూంబింగ్ చేపట్టారు.