తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లకు దేశీయ, ఇంటర్నేషనల్ సర్వీసుల టికెట ధరలపై 19 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తెలిపింది. ఈ రాయితీ పొందాలనుకునే ప్రయాణికుల వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎన్నికల సమయంలో ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ను పొందే ప్రయాణికులు తమ ఓటర్ ఐడీ కార్డును తప్పకుండా చూపించాలి.