ఎస్పీఎం పొగతో పట్టణవాసులకు అనేక ఇబ్బందులు

62చూసినవారు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎస్పీఎం మిల్లు నుంచి వెలువడే పొగతో అనేక ఇబ్బందులను ఎదురుకుంటున్నామని పట్టణంలోని 18వ వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. మంగళవారం వార్డు ప్రజలు ఎస్పీఎం జీఎంకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఎస్పీఎం పొగతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, హానికరమైన పొగను విడుదల చేస్తున్నారన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్