క్రికెట్ పోటీలను ప్రారంభించిన డిసిసి అధ్యక్షులు

79చూసినవారు
క్రికెట్ పోటీలను ప్రారంభించిన డిసిసి అధ్యక్షులు
చర్ల మండలం సీ. కోత్తూరు గ్రామంలో క్రికెట్ పోటీలను భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య శనివారం ప్రారంభించారు. గ్రామంలో అడుగుపెట్టిన వీరయ్యకు గ్రామస్తులు అడుగడుగునా నీరాజనం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో క్రికెట్ పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. ఇటువంటి క్రీడా పోటీల ద్వారా యువకుల్లో క్రమశిక్షణ పెరుగుతుందని, ప్రతిభ వెలుగులోకి వస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్