గోదావరి వరద ముంపు నుండి భద్రాచలం పట్టణ రక్షణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం బృందం కరకట్ట పనులను పరిశీలించారు. గోదావరి వరద ముంపు నుండి భద్రాచలం పట్టణ రక్షణకు శాశ్వత ప్రాతిపదికన నిర్దిష్టమైన ప్రణాళికలు ప్రకటన చేయాలని కోరారు. ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలన్నారు.