స్వార్థ ప్రయోజనాలకే పార్టీ మారుతున్నారు

1531చూసినవారు
బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నారని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. మహబూబాబాద్ లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని దుమ్ముగూడెం మండలం నడికుడి గ్రామంలో శనివారం నిర్వహించారు. భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావును నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి గెలిపించారని, చివరకు వారిని నట్టేట ముంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్