రామయ్యకు స్వర్ణ తులసి పూజలు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి శనివారం స్వర్ణ తులసి పూజలను అర్చకులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తెల్లవారుజామున మూల మూర్తులకు సుప్రభాత సేవ, ఆరాధన సేవాకాలం తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం గోదావరి తీర్థ జలాలతో మూలవరులకు అభిషేకం, తిరుమంజనం జరిపించారు. నిత్యకళ్యాణ మూర్తులను మేళతాళాలతో ఆలయం నుంచి బేడా మండపానికి తీసుకొచ్చి ఘనంగా రామయ్య కళ్యాణం నిర్వహించారు.