భద్రాద్రిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

73చూసినవారు
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 9వ తేది నుండి ప్రారంభమైన వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిసాయి. శ్రీ చక్రానికి పవిత్ర గోదావరిలో చక్ర తీర్ధం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పూర్ణహుతి, అనంతరం స్వామి వారి శేష వాహనసేవ కన్నుల పండువగా సాగింది. అనంతరం ద్వజారోహనం, దేవతోద్వాసనం, ద్వాదశ ప్రదక్షణలు, ద్వాదశారాధనలు, శ్రీపుష్ప యాగంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్