బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీలో చేరిక
వెంకటాపురం మండల బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి పిళ్ళారిశెట్టి మురళి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాజేడు మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.