ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

78చూసినవారు
బూర్గంపాడు మండలం పాండురంగాపురం రైల్వే స్టేషన్ వద్ద సోమవారం బీజేపీ జిల్లా నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. కేంద్రం ఒరిస్సా రాష్ట్రం మల్కానగిరి నుండి పాండురంగాపురం వరకు 173. 63 కిలోమీటర్లు మేర కొత్త రైల్వే లైన్ సుమారు 4150 కోట్లతో ఆమోదం తెలిపినందుకు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్