రహదారికి మరమ్మత్తులు చేయించిన తహసీల్దార్

70చూసినవారు
మణుగూరు మున్సిపాలిటి పరిధిలోని కమలాపురంలో ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురై రోడ్డు కృంగిపోయింది. దీంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ రాఘవ రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకుని శుక్రవారం రహదారికి మరమ్మత్తులు చేయించారు. రోడ్డుకు మరమ్మత్తులు చేయించడం పట్ల గ్రామస్తులు తహశీల్దార్ రాఘవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్