రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో 1989లో ఏలూరు నుంచి లోక్సభ ఎంపీగా 71వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. కానీ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురవ్వడంతో రెండేళ్లకే మధ్యంతర ఎన్నికలు రావడం అందులో కృష్ణ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం రీత్యా చనిపోయే ముందు వరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా వ్యవహరించారు.