కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే పార్టీ BRS అని కేటీఆర్ అన్నారు. ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను ఆయన తెలంగాణ భవన్లో పంపిణీ చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. కార్యకర్తలు కేసీఆర్ కుటుంబంలో సభ్యులేనన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకునే అందరికీ ప్రమాద బీమా రూ.2 లక్షల చొప్పున కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.118 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని కార్యకర్తల బీమా కోసం వెచ్చించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5522 మందికి లబ్ది చేకూరిందన్నారు.