రేపు ఉమ్మడి ఖమ్మంలో కేటీఆర్ పర్యటన

52చూసినవారు
రేపు ఉమ్మడి ఖమ్మంలో కేటీఆర్ పర్యటన
పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉ. 8 గం.కు HYD నుంచి రోడ్ మార్గం ద్వారా బయలుదేరి 10 గంటలకు ఇల్లందుకు చేరుకొని.. పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి కొత్తగూడానికి మ. 12 గంటలకు చేరుకొని పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. సా. 4 గంటలకు ఖమ్మం చేరుకొని SBIT కాలేజ్ లో జరిగే పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో పాల్గొని దిశా నిర్దేశం చేస్తారు.

సంబంధిత పోస్ట్