‘ఐదో విడత’ సమరంలో 695 మంది అభ్యర్థులు

81చూసినవారు
‘ఐదో విడత’ సమరంలో 695 మంది అభ్యర్థులు
లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌ సోమవారం జరగనున్న సంగతి తెలిసిందే. ఆరు రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల పండుగ జరగనుంది. వీటిలో ఉత్తర​ప్రదేశ్‌లోని 14, మహారాష్ట్రలోని 13, బెంగాల్‌లోని 7, బిహార్‌లోని 5, ఒడిశాలోని 5, జార్ఖండ్‌లోని 3, జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌లోని చెరో లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ అభ్యర్థుల భవితవ్యాన్ని 8.95 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు.

సంబంధిత పోస్ట్