AP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డిపై కేసు నమోదైంది. రాచమల్లు బావమరిది బంగారు మునిరెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలకు స్టేషన్లో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఓ కార్యకర్తను రాచమల్లు బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారన్న ఫిర్యాదుతో రాచమల్లుపై కేసు ఫైల్ చేశారు.