రైతన్నలపై లాఠీచార్జిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్

66చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జిని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. 'రైతన్నలపై లాఠీచార్జ్ చేయటం అత్యంత దారుణం.. దాడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే సీఎం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు.. రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలి' అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్