జనతాదళ్ (సెక్యులర్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్ట్ను రద్దు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు మద్దతిస్తున్నట్లు కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. ప్రజ్వల్ దౌత్య పాస్పోర్ట్ను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే స్వాగతిస్తామన్నారు. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ మహిళలు పోలీసులను ఆశ్రయించడంతో, కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటుచేసింది.