ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. కామెడీ ప్రోగ్రామ్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పిటిషన్ను ఈ నెల 16న విచారిస్తానని అప్పటి వరకు కునాల్ కమ్రాను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది.