భూ వివాదం.. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి

80చూసినవారు
భూ వివాదం.. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి
మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఓ భూమి విషయమై వివాదం నెలకొంది. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. ఇరువురు నాగా వర్గానికి చెందినవారే అయినా హున్‌ఫున్, హాంగ్‌పంగ్ అనే రెండు వేర్వేరు గ్రామాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్‌తో పాటు భారీగా పోలీసులను మోహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్