బీజేపీకి రానున్న లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు వస్తాయని ప్రధాని మోడీ చెప్పారు. లోక్సభలో సోమవారం ఆయన మాట్లాడారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటామన్నారు. వెయ్యేళ్ల అభివృద్ధికి పునాదులు వేస్తామని చెప్పారు. తమకు ఓట్లు కాదని, ప్రజల హృదయాల్లో స్థానమే ముఖ్యమని అన్నారు. బీజేపీలో ఓబీసీ నేతలు లేరని
కాంగ్రెస్ అంటోందని, తాను వారికి కనపడలేదా అని ప్రశ్నించారు.