ప్రపంచవ్యాప్తంగా మానవుల సగటు ఆయుర్దాయం 2050 నాటికి ఐదేళ్లు పెరగనుందని ‘లాన్సెట్’ జర్నల్ నివేదిక వెల్లడించింది. స్త్రీ, పురుషుల జీవితకాలం 73.6 ఏండ్ల నుంచి 78.1 ఏండ్లకు పెరిగే అవకాశముందని నివేదిక అంచనా వేసింది. అంటువ్యాధుల నివారణలో వైద్య చికిత్సలు అందుబాటులోకి రావటం భారత్లో జీవితకాలం పెరగడానికి దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.