బోధన్ హాస్టల్లో డిగ్రీ విద్యార్థి హత్య జరగడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. హాస్టల్ వార్డెన్, వాచ్మెన్ లేకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని, ఎనిమిది మంది విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైందని తెలిపారు. మరణించిన విద్యార్థి కుటుంబానికి రూ.15 లక్షల ఎక్స్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.