ఏపీలో 1.47కోట్ల రేషన్ కార్డులకు సంబంధించి.. 4.29 కోట్ల మంది సభ్యుల ఆశలతో ఆటలాడుకున్నారు. రేషన్ బియ్యం కొల్లగొట్టి రూ.వందల కోట్లు దోచుకున్నారు. కాకినాడ కేంద్రంగా పెత్తనం చేసే వైసీపీకి చెందిన కొందరు మిల్లర్ల సంఘం నాయకులకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. ఏళ్ల తరబడి తిష్టవేసిన కొందరు అధికారుల పెత్తనంలో..వారు చెప్పిందే వేదంగా దస్త్రాలు నడిపిస్తున్నారు. నచ్చని అధికారుల్ని పోస్టుల నుంచి తప్పించి సాగనంపారు.