రాంచీ టెస్టులో పట్టుబిగించిన టీమిండియా గెలుపు వాకిట ఆచితూచి ఆడుతోంది. ఇంగ్లాండ్ యువ స్పిన్నర్లు టామ్ హర్ట్లే, షోయబ్ బషీర్ విజృంభణతో 16 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 100 రన్స్కే మూడు వికెట్లు పడిన దశలో.. శుభ్మన్ గిల్(18), రవీంద్ర జడేజా(5)లు నిలకడగా ఆడుతున్నారు. లంచ్ సమయానికి భారత్ స్కోర్ 118/3. భారత్ విజయానికి ఇంకా 74 పరుగులు కావాలి.