బీహార్లోని కైమూర్ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోగా, వారిలో భోజ్పురి చిత్ర పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు ఉన్నారు. నటీమణులు ఆంచల్, సిమ్రాన్ శ్రీవాస్తవ, సింగర్లు ఛోటూ పాండే, సత్యప్రకాశ్ మిశ్రా ప్రమాదంలో చనిపోయారు. దీంతో భోజ్పూర్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరి మృతి పట్ల బీహార్ సీఎం నితీష్ కుమార్ సంతాపం తెలిపారు.