భారత్-జపాన్ సేనల 'ధర్మ గార్డియన్' విన్యాసాలు

61చూసినవారు
భారత్-జపాన్ మధ్య రక్షణ సహకారం బలోపేతమే లక్ష్యంగా రాజస్థాన్‌లోని మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో 'ధర్మ గార్డియన్' పేరిట సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఈ యుద్ధ క్రీడలు మార్చి 9 వరకు కొనసాగనున్నాయి. సైనిక సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం, వ్యూహాత్మక కసరత్తులు, ఇంటెలిజెన్స్, నిఘా గ్రిడ్ ఏర్పాటు, ప్రత్యేక ఆయుధ నైపుణ్యాలపై సైనికులు ప్రత్యేక దృష్టిసారిస్తారు. అత్యాధునిక ఆయుధ సామాగ్రిని ప్రదర్శిస్తారు.

సంబంధిత పోస్ట్