ప్రధాని మోదీపై హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె మాట్లాడుతూ.. 'ప్రజల డబ్బు ప్రజలే అనుభవించాలన్న నేత మోదీ ఒక్కరే. రూ.లక్షల కోట్ల డబ్బును ప్రజలకే ఖర్చు పెడుతున్న గొప్ప నేత మోదీ. 2011లో అక్బరుద్దీన్ మేము.. రజాకార్లమే అన్నారు. రజాకార్ల పాలన అంతం కావాలని చేసిన పోరాటంలో ఎంతోమంది చాలా నష్టపోయారు.' అని అన్నారు.